APPSC Group 1 ఫలితాలు విడుదల

అమరావతి: 2018 గ్రూప్‌-1 నోటిఫికేషన్‌కు సంబంధించి మెయిన్స్‌ ఫలితాలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్‌సీ) విడుదల చేసింది. ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్‌సీ ప్రకటించింది.

ఏపీపీఎస్‌సీ వెబ్‌సైట్‌(www.psc.ap.gov.in)లో ఎంపికైన అభ్యర్థుల వివరాలను అధికారులు ఉంచారు. అభ్యర్థులకు జూన్‌ 14నుంచి ముఖాముఖి పరీక్షలు జరగనున్నాయి.